అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా? తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా?

పల్లెప్రపంచం విజన్ లో భాగమైన ఒక అంశం: “తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం.” ఆ మేరకు నా వంతు ప్రయత్నంగా తెలుగు భాషకు సంబంధించిన సమాచార సేకరణలో భాగంగా కొన్ని ప్రశ్నలుంచాను. భాషపై అభిమానమున్నవారే కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత అనవసర వాదులాటలు ఆవేశకావేశాలు దొర్లినా మొత్తం మీద తెలుగు భాషాభివృద్ధిపై మన బ్లాగర్లంతా మంచి కృషే చేస్తున్నారు. తెలుగు వెలుగులు విరజిమ్మించగల సత్తా ఉన్నవారు నేటికీ ఉన్నారనిపించడం సంతోషించదగ్గ విషయం. మాతృభాషపై మమకారం తగ్గుతున్నదన్న వాదన … Read more

మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం

మలేసియాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగువారి సంక్షేమం, భాషాభివృద్ధికి మలేసియా ప్రభుత్వం బాగా సహకరిస్తోందని మలేసియా తెలుగు సంఘం(టామ్‌) అధ్యక్షుడు డా. అచ్చయ్యకుమార్‌ తెలిపారు. కౌలాలంపూర్‌ చివరిన రెండున్నర ఎకరాల్లో అంతర్జాతీయ తెలుగు కేంద్రం, భవన నిర్మాణం ప్రారంభించామని, మరో ఏడాదిలోగా ఈ భవనం పూర్తవుతుందన్నారు. రూ.15కోట్లతో నిర్మించే ఈ భవనానికి కౌలాలంపూర్‌ ప్రభుత్వం రూ.5కోట్లు అందించిందని తెలిపారు.  Source: Andhrajyothy

శ్రీకాకుళంలో 16న తెలుగు నాటకరంగ దినోత్సవం

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రచలనచిత్ర, టివి, నాటకరంగ అభివృధ్ధి సంస్ధ సౌజన్యంతో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమం 16వ తేదీ సాయంత్రం 5 గంటలనుండి బాపూజీ కళామందిర్‌లో జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా లబ్దప్రతిష్టులైన కళాకారులను కందుకూరి విశిష్ఠ పురస్కారంతోసన్మానించడం జరుగుతుందన్నారు. ఈ లబ్దప్రతిష్టుల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో పూర్తి అయిందని ఆయన అన్నారు. … Read more

ఘనంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఉగాది వేడుకలు

అమెరికాలొని మేరీలాండ్ లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో  ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.  మేరీలాండ్‌లోని గేతర్స్బర్గ్ హైస్కూల్ ఈ వేడుకలకి వేదికగా నిలిచింది.  వర్జీనియా, మేరీలాండ్, డి.సి రాష్ట్రాలనుంచి వేయి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరై  కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుభప్రదమైన పంచాంగ శ్రవణముతో వేడుకలు మొదలైనాయి. స్థానిక బాలబాలికలు, మహిళల సంగీత, నృత్య ప్రదర్శనలు,  ప్రముఖ డ్యాన్సర్ కళాధర్ నృత్యం మొదలైన కార్యక్రమాలు స్థానిక ప్రతిభను చాటిచెప్పాయి.  ప్రముఖ … Read more

మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌

మలేషియాలో తెలుగు వారు ప్రత్యేక పాఠశాలల ద్వారా తెలుగు భాషకు చేస్తున్న సేవలు మరువలేనివని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మలేషియాలో మారుమూల ప్రాంతమైన లాగనదత్త గ్రామంలో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయా గ్రామాల్లో తెలుగుబోర్డులను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు సోమినాయుడు, అప్పలనాయుడు, జీవి శ్రీరాములు పాల్గొన్నారు.

వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అతి తక్కువ వ్యవధిలో వేమన శతక పద్యాలను అవలీలగా ధారణ చేసి అబ్బురపరిచాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో చిలకా రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలలో వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకుల సమక్షంలో ఎనిమిది నిమిషాల్లో వంద వేమన శతకాల్లో ఏది అడిగినా తడుముకోకుండా వల్లెవేశాడు. రాహుల్ ధారణశక్తిని అరుదైనదిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు గుర్తించి నమోదు చేశారు. Source: … Read more

తెలుగు భాషను ఎవరూ విడగొట్టలేరు : చెన్నమనేని విద్యాసాగర్ రావు

bjp-vidhyasagar rao

తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌… రాష్ట్రాలుగా విడిపోవ‌చ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లూ ఐక‌మ‌త్యంతో ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఉద్య‌మం ముగిసిన త‌రువాత‌, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ముందెన్న‌డూ లేని ఒక సుహృద్భావ వాతావ‌ర‌ణం ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొంది అనేది వాస్త‌వం. ఇరు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు. ఢిల్లీలో తెలుగు అకాడ‌మీ ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉభ‌య … Read more

పద్మ భూషణుడు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ లంకెలో వీక్షించవచ్చు – … Read more

తెలుగు ‘పద్మాలు’ వీరే !

తెలుగు ‘పద్మాలు’ వికసించాయి. జర్నలిజానికి సంబంధించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ‘పద్మ విభూషణ్’ అవార్డు దక్కింది. ఆయనతోపాటు తెలుగు వారైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కూడా పద్మాలు దక్కాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిల కు పద్మభూషణ్ లభించాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు లభించింది. క్రీడా రంగంలో రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహ్వల్ కు కూడా అవార్డులు దక్కాయి.

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అగత్యం ప్రస్తు తం ఏర్పడిందని ప్రముఖులు పేర్కొన్నారు. వైజ్‌మెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ‘హెరిటేజ్‌ ఆఫ్‌ తెలుగు కల్చర్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రముఖులు పూర్ణచంద్రరావు, శంకర్‌రెడ్డి, నటి రమ్యానాయుడు, హషన్‌ తదిత రులు తెలుగు సంస్కృతి వైభవం గురించి మా ట్లాడారు. కార్యక్రమ అధ్యక్షుడు వైఎస్‌ ఆర్‌ మూర్తి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భాష కు సేవ చేస్తున్న జర్నలిస్టులను, కళాకారులను … Read more