నారాయణ భట్టు
నన్నయ సమకాలికునిగా ప్రసిద్దుడైన నారాయణ భట్టు 11వ శతాబ్దం వాడు . ఈయనకు కరీభ వజ్రాంకుడు అనే బిరుదు కలదు. ఈయన బహు భాషా కోవిడునిగాను, ఉద్దండ పండితునిగాను పేరు తెచ్చుకున్నాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించి రాజరాజ నరేంద్రుడు నందంపూడి దాన శాసనాన్ని లిఖింపజేసి ఆ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు . ఈ శాసనమే భట్టు గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. క్రీ.శ.1022 నుండి 1063వరకు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని వెంఘీ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి రాజరాజనరేంద్రుడు నారాయణభట్టుకు ఇచ్చిన నందంపూడి అగ్రహారం కోనసీమలోనిదేనని నందంపూడి శాసనం తెలుపుతుంది. అందులో పేర్కొన్నట్లు రెండేరుల నడియదేశం అంటే గౌతమీ, వైనతేయ నదులమధ్య ఉన్న అంబాజీపేటలోని నందంపూడి అని చెబుతారు.
images: telugubooks.in and wikimedia.org