శ్రీ మదాంధ్ర మహాభారతం (కవిత్రయ విరచిత) Mahabharatam in Telugu Full PDF

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం గంధాన్ని ప్రచురించారు. మొత్తం 18 పర్వాలను 15 సంపుటాలుగా ముద్రించారు.  క్రీడి లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Download Mahabharatam in Telugu Written by Nannaya, Tikkana, Errana

క్ర. సంఖ్య పర్వం అంశాలు ఆంధ్ర భారతంలో పద్య గద్య సంఖ్య ఆంధ్ర భారతంలో
ఆశ్వాసాల సంఖ్య
డౌన్లోడ్ లింకు
1 ఆది పర్వము తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ఋషులందరూ వినుచుండగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి (ఆది అంటే మొదటి). 2,084 8 Click Here (Part-1)

Click Here (part-2)

2 సభా పర్వము దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది. 618 2 Click Here
3 వన పర్వం లేదా అరణ్యపర్వం 12 సంవత్సరాల పాండవుల అరణ్యవాసం. (అరణ్య) 2,894 7 Click Here
4 విరాట పర్వము విరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది. 1,624 5 Click Here
5 ఉద్యోగ పర్వము పాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (ఉద్యోగఅంటే పనిచేయడం). 1,562 4 Click Here
6 భీష్మ పర్వము భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.[26][27] 1,171 3 Click Here
7 ద్రోణ పర్వము ద్రోణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. ” బుక్ ఆఫ్ వార్ ” పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు. 1,860 5 Click Here
8 కర్ణ పర్వము కౌరవపక్షంలో కర్ణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. 1,124 3 Click Here
9 శల్య పర్వము కౌరవపక్షంలో శల్యుని సారథ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట. 827 2 Click Here
10 సౌప్తిక పర్వము అశ్వమేధ పర్వము కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు. 376 2
11 స్త్రీ పర్వము గాంధారి, కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట. 376 2
12 శాంతి పర్వము చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్థిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని ” కిసారి మోహను గంగూలి ” అభిప్రాయపడ్డాడు. 3,093 6 Click Here
13 అనుశాసనిక పర్వము భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన). 2,148 5 Click Here
14 అశ్వమేథ పర్వము [28] యుధిష్టరుడు నిర్వహించిన అశ్వమేథయాగం. అర్జునుడి విజయయాత్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట. 976 4 Click Here
15 ఆశ్రమవాస పర్వము ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట. 362 2
16 మౌసల పర్వము గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట. 226 1
17 మహాప్రస్థానిక పర్వము యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు. 79 1
18 స్వర్గారోహణ పర్వము యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుట. 97 1
హరివంశ పర్వము / భవిష్య పర్వం 18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.
మొత్తం 21,507 63