వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అతి తక్కువ వ్యవధిలో వేమన శతక పద్యాలను అవలీలగా ధారణ చేసి అబ్బురపరిచాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో చిలకా రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలలో వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకుల సమక్షంలో ఎనిమిది నిమిషాల్లో వంద వేమన శతకాల్లో ఏది అడిగినా తడుముకోకుండా వల్లెవేశాడు. రాహుల్ ధారణశక్తిని అరుదైనదిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు గుర్తించి నమోదు చేశారు. Source: … Read more

తెలుగు భాషను ఎవరూ విడగొట్టలేరు : చెన్నమనేని విద్యాసాగర్ రావు

bjp-vidhyasagar rao

తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌… రాష్ట్రాలుగా విడిపోవ‌చ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లూ ఐక‌మ‌త్యంతో ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఉద్య‌మం ముగిసిన త‌రువాత‌, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ముందెన్న‌డూ లేని ఒక సుహృద్భావ వాతావ‌ర‌ణం ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొంది అనేది వాస్త‌వం. ఇరు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు. ఢిల్లీలో తెలుగు అకాడ‌మీ ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉభ‌య … Read more

పద్మ భూషణుడు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ లంకెలో వీక్షించవచ్చు – … Read more

తెలుగు ‘పద్మాలు’ వీరే !

తెలుగు ‘పద్మాలు’ వికసించాయి. జర్నలిజానికి సంబంధించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ‘పద్మ విభూషణ్’ అవార్డు దక్కింది. ఆయనతోపాటు తెలుగు వారైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కూడా పద్మాలు దక్కాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిల కు పద్మభూషణ్ లభించాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు లభించింది. క్రీడా రంగంలో రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహ్వల్ కు కూడా అవార్డులు దక్కాయి.

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అగత్యం ప్రస్తు తం ఏర్పడిందని ప్రముఖులు పేర్కొన్నారు. వైజ్‌మెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ‘హెరిటేజ్‌ ఆఫ్‌ తెలుగు కల్చర్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రముఖులు పూర్ణచంద్రరావు, శంకర్‌రెడ్డి, నటి రమ్యానాయుడు, హషన్‌ తదిత రులు తెలుగు సంస్కృతి వైభవం గురించి మా ట్లాడారు. కార్యక్రమ అధ్యక్షుడు వైఎస్‌ ఆర్‌ మూర్తి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భాష కు సేవ చేస్తున్న జర్నలిస్టులను, కళాకారులను … Read more

నారాయణ భట్టు

నన్నయ సమకాలికునిగా ప్రసిద్దుడైన నారాయణ భట్టు 11వ శతాబ్దం వాడు . ఈయనకు కరీభ వజ్రాంకుడు అనే బిరుదు కలదు. ఈయన బహు భాషా కోవిడునిగాను, ఉద్దండ పండితునిగాను పేరు తెచ్చుకున్నాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించి రాజరాజ నరేంద్రుడు నందంపూడి దాన శాసనాన్ని లిఖింపజేసి ఆ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు . ఈ శాసనమే భట్టు గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. క్రీ.శ.1022 నుండి 1063వరకు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని వెంఘీ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి … Read more

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

vankayala

ఫిరంగిపురం : నాటకం జనజీవన స్రవంతిలో మమేకమై సామాజిక చైతన్యానికి ఊపిరి పోస్తుందని అభినయ నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు వంకాయలపాటి శివరామకృష్ణయ్య అన్నారు. శనివారం రాత్రి 11వ అభినయ నాటక కళా పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాటక పరిషత్‌ వ్యవస్థాపకుడు అభినయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నాటకంపై ఉన్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని పొనుగుపాడు గ్రామంలో నాటక పరిషత్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో … Read more

పర్యాటక, సాహిత్య కేంద్రంగా పోతన జన్మస్థలం

మహాభాగవత రచయిత, తెలంగాణ కవి బమ్మెర పోతన జన్మస్థలం పర్యాటక సాహిత్య కేంద్రంగా మారనుంది. వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతంతోపాటు పాలకుర్తి, వల్మిడిలను కూడా పర్యాటక సాహిత్య కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ.. నివేదిక రూపకల్పన చేస్తోంది. కమలాక్షునర్చించు కరములు, కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ అంటూ.. అలనాటి కవుల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు కవి బమ్మెర పోతన. మహా భాగవతం ద్వారా ప్రపంచ భక్తి … Read more

చరిత్రను ఒపాసన పట్టిన లక్ష్మీ శ్రీజ

లక్ష్మీ శ్రీజ… కాకతీయుల పాలన నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్ల నుంచి కరంట్ ఎఫైర్స్ వరకూ… మూడవ తరగతి చదువుతున్న ఆ చిన్నారి అనర్గళంగా చెబుతుంటే, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆనందించి ముగ్ధుడయ్యారు. అంతేనా, తన సొంత ఖాతా నుంచి అప్పటికప్పుడు రూ. 10 లక్షలు ఇచ్చారు. శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతుల గారాలబిడ్డ … Read more

‘ఒగ్గుకథ’కు ప్రాణం పోస్తున్న చుక్క సత్తెయ్య

తెలంగాణ జానపదం -ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం.తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పూర్వం పల్లెల్లో వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు ఈ డిజిటల్ మాయాజాలం వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగై పోతున్నాయి. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. … Read more