14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు నీతి కథల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు వరుసగా రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

Leave a Comment