14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు నీతి కథల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు వరుసగా రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్

గజల్ చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచనా పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. గజల్ ఛందస్సు లక్షణాలతో భావ వ్యక్తీకరణ కలిగిన గజల్‌కు ప్రధమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతి గా రూ.7,000/-, తృతీయ బహుమతిగా రూ. 5,000/-మరియు మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి రూ. 1,116/- అందజేయబడతాయని తెలిపారు. గజల్‌లో ఏడు షేర్‌లు మాత్రమే ఉండాలని, ప్రతి కవితను పంపిన ఎంట్రీలతో నాలుగు గజళ్ళు పంపవచ్చని, … Read more