మోగులూరి సోమాచారి

mogaloori-somachari

సామర్లకోటను చూస్తే అక్కడి చరిత్రాత్మక షుగర్‌ ఫ్యాక్టరీ, విశాఖకు దగ్గరలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషనే ప్రపంచానికి కనిపిస్తుంది. విప్లవోద్యమ స్పర్శ ఉన్న వాళ్లకు మాత్రం సామర్లకోటంటే సోమాచారి గుర్తుకు వస్తాడు. సోమాచారి ప్రతిఘటనా దారుల్లో పుష్పిస్తాడు. విప్లవోద్యమ బాటల్లో ఒక మైలురాయిగా నిలుస్తాడు.   మోగులూరి సోమాచారి యోధుడే. ప్రజల కోసం ప్రతిఘటనా మార్గం ఎంచుకున్న వీరుల దారిలో మోగులూరి ప్రతిఘటనా జెండానే. 2016 జూన్‌ 6న తుది శ్వాస విడిచే దాకా నీ కోరిక ఏదంటే ప్రజల … Read more

పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకే నష్టం!

దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత గౌరవ ప్రదమైన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్‌సీ ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాసరూప ప్రశ్న జవాబులుండే ప్రధాన పరీక్ష మార్కులను ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి ఎంపిక ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షలో ఒక ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లతో పాటు ఇంగ్లీషు ఒక భారతీయ భాషలో కూడా పరీక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీషు, భారతీయ భాష పరీక్షలు పదవ తరగతి స్థాయి ఉండి … Read more

14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు నీతి కథల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు వరుసగా రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

పావులూరి మల్లన

పావులూరి మల్లన: పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్న అను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ శివ్వన్న తోబుట్టువని మలయమారుత కవీంద్రునిచే రచించబడిన “నీతి శాస్త్రము”లో వ్రాయబడింది. పావులూరి మల్లన గణితశాస్త్రములో మిక్కిలి పండితుడు. “పావులూరి గణితము” అనే పేరుతో గణితశాస్త్రమున ఒక పుస్తకం రచించాడు. … Read more

డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నో … Read more

ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార సాంస్కృతిక శాఖ నిర్వహణలో మంగళవారం రాత్రి ప్రకాశం భవన్‌లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్‌ కలెక్టర్‌-2 ప్రకాష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. నాటక రంగానికి వీరేశలింగం పంతులు చేసిన కృషి అనన్యమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ప్రభుత్వం రంగస్థల కళాకారుల సంక్షేమానికి అనేక విధాలా చేయూత అందిస్తోందన్నారు. విశిష్ట అతిథులు డీఆర్వో … Read more

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ వెలసింది. ఉన్న తెలుగు సంఘాలతో మైత్రీ బంధాన్ని పెనవేసుకుంటూ, తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కొన్ని వినూత్నప్రయత్నాలు తలపెడుతున్నట్టు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి తెలిపారు. తెలుగువారి మధ్య న్యూజెర్సీ నగరంలో ఈ వేడుక జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాసభారతీయ విద్యార్థులు ప్రదర్శించినసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే రీతిలో జరిగాయి.ఈ వేడుకలో న్యూజెర్సీ కాంగ్రెస్ మ్యాన్ గా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపచేస్తున్న … Read more

కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం”

కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు. కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని కేంబ్రిడ్జి ఇంగ్లీష్ స్కూల్ లో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన గుమ్మడి గోపాల కృష్ణ, 6 లైన్స్ గా అవబోతున్న బందర్ రోడ్డులో కంకిపాడు వద్ద వరల్డ్ క్లాస్ వెంచర్ విజిల్ శివప్రసాద్, సాకేత్ కోమండూరి, నికితా శ్రీవల్లి, సాయి హేమంత్ లచే “స్వరాభినయ సంగమం” … Read more

తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్

గజల్ చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచనా పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. గజల్ ఛందస్సు లక్షణాలతో భావ వ్యక్తీకరణ కలిగిన గజల్‌కు ప్రధమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతి గా రూ.7,000/-, తృతీయ బహుమతిగా రూ. 5,000/-మరియు మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి రూ. 1,116/- అందజేయబడతాయని తెలిపారు. గజల్‌లో ఏడు షేర్‌లు మాత్రమే ఉండాలని, ప్రతి కవితను పంపిన ఎంట్రీలతో నాలుగు గజళ్ళు పంపవచ్చని, … Read more

తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీనటుడు, కవి తనికెళ్ల భరణి అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరుకు వచ్చిన ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రల్లో కమ్మని తెలుగుభాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు. source: Andhrajyothy